జమ్మూ కాశ్మీర్ కి త్వరలోనే రాష్ట్ర హోదా: మోడీ

-

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా గురించి ప్రధాన నరేంద్ర మోడీ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. త్వరలోనే జమ్ము కాశ్మీర్ కి రాష్ట్ర హోదా వస్తుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలోనే జరుగుతాయని అన్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదంపూర్లో నిర్వహించిన ర్యాలీలు మోడీ పాల్గొన్నారు. ఆ ర్యాలీలో ఆయన ప్రసంగించారు తను ఎప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుచూపుతోనే ఆలోచిస్తానని అన్నారు.

ఎప్పుడైనా ముందు చూపుతోనే ఆలోచిస్తానని జమ్మూ కాశ్మీర్లో జరిగిన మార్పులు అన్ని ట్రైలర్ మాత్రమేనని అన్నారు ఆర్టికల్ 370 గురించి ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి అసత్యాలు ప్రచారం చేస్తుందని అన్నారు. జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాదం తగ్గిపోయిందని సరిహద్దుల్లో కాల్పులకి భయపడకుండా ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి అని ప్రధాన నరేంద్ర మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news