తెలంగాణ లో దోపిడీ జరుగుతోంది: మోడీ

-

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప బహిరంగ సభ లో ప్రధాని నరేంద్ర మోడీ కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణ లో కూడా బిజెపి గాలి వీస్తోందని చెప్పారు. నాగర్ కర్నూల్ ప్రజలు ఈసారి బిజెపిని గెలిపించాలని అన్నారు. మల్కాజ్గిరిలో రోడ్ షో బ్రహ్మాండంగా జరిగింది అని చెప్పారు.

ప్రజలు వీధుల్లో బారులు తీరి బిజెపికి సపోర్ట్ ఇచ్చారని అన్నారు. బీఆర్ఎస్ పట్ల కోపాన్ని ప్రజలు అసెంబ్లీ ఎన్నికలు లో చూపించారని అన్నారు సార్వత్రిక ఎన్నికల్లో మూడవ సారి కూడా బిజెపి అధికారం లోకి వస్తుందని చెప్పారు తెలంగాణని గేటు సౌత్ అంటారని తెలంగాణ లో కూడా దోపిడీ జరుగుతుందని అన్నారు. అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ దోచేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news