ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ ఫోన్, ఎందుకు…?

-

ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ కి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కూడా ఈ ఫోన్ సంభాషణలో జరిగాయి. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నా స్నేహితుడు ఇజ్రాయల్ ప్రధానితో మాట్లాడారు. కరోనా వైరస్ గురించి మేము ఇద్దరం చర్చించాం అని పేర్కొన్నాడు.

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో భారతదేశం- ఇజ్రాయెల్ సహకారం గురించి చర్చించామని మోడీ పేర్కొన్నారు. వ్యవసాయం, నీరు మరియు ఆవిష్కరణ వంటి ఇతర రంగాలలో మా కార్యక్రమాలను కూడా సమీక్షించామని చెప్పారు. కాగా వ్యాక్సిన్ తయారీలో ఇజ్రాయిల్ కీలకంగా మారిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version