నేడు బ్యాంకుల అధినేతలతో మోదీ సమావేశం..!

-

కరోనా మహకు కొద్ది రోజులుగా ఆర్థిక రంగంలోని వివిధ విభాగాలతో సమావేశమవుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుఅందులో భాగంగానే ఇవాళ దేశంలోని పెద్ద బ్యాంకులు, బ్యాంకింగ్​యేతర ఆర్థిక సంస్థలు(ఎన్​బీఎఫ్​సీ) అధిపతులతో సమావేశం కానున్నారు. తీవ్రంగా ప్రభావతమైన ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు మోదీ. ఈ మేరకు అధికారి ప్రకటన జారీ చేసింది కేంద్రం.

pm modi

కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మే నెలలో ప్రకటించిన రూ. 20.97 లక్షల కోట్ల ప్యాకేజీలోని పలు అంశాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాయి. ఈ సమావేశం అంజెండాలో ప్రధానంగా.. రుణాల మంజూరుకు సమర్థవంతమైన వ్యవస్థ, సాంకేతికత ద్వారా ఆర్థిక సాధికారత, ఆర్థిక రంగలో స్థిరత్వం వంటి అంశాలు ఉన్నాయి. మౌలిక, వ్యవసాయ, ఎంఎస్​ఎంఈలకు ఆర్థికంగా చేయూతనిస్తూ.. దేశ ఆర్థిక వృద్ధిలో బ్యాంకింగ్​ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ భేటీకి ప్రభుత్వ సీనియర్​ అధికారులు కూడా హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version