కరోనా వ్యాక్సిన్ పై మోడీ కీలక ప్రకటన…!

-

దేశం కరోనా వ్యాక్సిన్ కోసం చాలా ఆశగా ఎదురు చూస్తుంది. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. నేడు జాతిని ఉద్దేశించి మాట్లాడిన మోడీ… నేడు మూడు టీకాలు భారతదేశంలో పరీక్ష దశలో ఉన్నాయని అన్నారు. శాస్త్రవేత్తలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే, దేశం వాటిని పెద్ద ఎత్తున ఉత్పత్తిని ప్రారంభిస్తామని మోడీ అన్నారు. పది రోజుల క్రితం అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ప్రధాని అన్నారు.

భారత్ ప్రపంచంలో ఎవరికన్నా తక్కువ కాదని మోడీ ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ఉత్తమ ఉత్పత్తుల దేశంగా భారత్ ఉందని మోడీ పేర్కొన్నారు. మన ఉత్పత్తులకు తగిన మార్కెట్ ని మనమే సృష్టించుకోవాలి అని మోడీ కోరారు. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని జాతి మొత్తం ఆహ్వానించింది అని మోడీ పేర్కొన్నారు. పశ్చిమ ఆసియా దేశాల్లో భారత్ చాలా కీలక దేశమని అన్నారు ఆయన.

Read more RELATED
Recommended to you

Exit mobile version