రేవంత్ కంటే కేసీఆరే నయం అనిపిస్తుంది.. మోత్కుపల్లి

-

రేవంత్ కంటే కేసీఆర్ నయం అనిపిస్తుంది మా జాతిని ఎదగకుండా మా మాదిగ జాతిని బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నావ్ అని మోత్కుపల్లి నరసింహులు రేవంత్ రెడ్డి మీద కామెంట్స్ చేసారు. అలానే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ నీ కంటే కేసీఆర్ నయం అనిపిస్తుందని పొలాలు ఎండిపోతున్నాయి. కరెంటు లేదు. దళిత బంధు లేదు రైతుబంధు లేదు అని అన్నారు. అలానే తులం బంగారం లేదు అని అన్నారు.

Motkupalli narsimhulu

2,500 మహాలక్ష్మి పథకం లేదు అని మోత్కుపల్లి రేవంత్ రెడ్డి పై కామెంట్స్ చేశారు ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తోందని రేవంత్ రెడ్డిని కలుస్తున్న వాళ్ళు అందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులేని అన్నారు మోత్కుపల్లి. పేదలు ఎవరూ రావట్లేదని పేరుకి ప్రజాపాలనని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని అన్నారు ప్రగతిభవన్లో ప్రజాపాలన అని పెట్టి మూడు రోజులకే మూసేశారు అని అన్నారు. ఒకసారి వచ్చిన రేవంత్ రెడ్డి మళ్ళీ ఎందుకు రాలేదని అడిగారు.

Read more RELATED
Recommended to you

Latest news