తిరుమలలో ఎల్‌ఈడీ స్క్రీన్‌పై సినిమా పాటలు.. స్పందించిన TTD

-

తిరుమలలోని ఎల్ఈడి స్క్రీన్ పై శుక్రవారం సినిమా పాటలు ప్రత్యక్షం కావడం పై టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి స్పందించారు. బ్రాడ్ కాస్ట్ ఉద్యోగి స్నేహితుడి కారణంగా ఈ సమస్య తలెత్తిందని ఆయన వివరించారు. జరం అందరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ ఓ ధర్మారెడ్డి. ఎల్ఈడి స్క్రీన్ పై సినిమా పాటలు ప్రసారం కావడాన్ని తొలుత సాంకేతిక సమస్య గుర్తించినట్లు చెప్పారు.

అయితే ప్రాథమిక విచారణ అనంతరం బ్రాడ్ కాస్టింగ్ ఉద్యోగి స్నేహితుడు ఇందుకు కారణమని తేలిందని వెల్లడించారు. ఉద్యోగి తన స్నేహితుడిని బ్రాడ్ కాస్ట్ గదిలోకి తీసుకు వెళ్లాడని… ఆ తర్వాత అతడిని అక్కడే ఉంచి వేరే పనిలో వైకుంఠం 2 వరకు ఆయన వెళ్లినట్లు ఈవో తెలిపారు. బ్రాడ్ కాస్ట్ గదిలో ఉన్న అతని స్నేహితుడు అక్కడ ఉన్న రిమోట్ తో ఆపరేట్ చేయడం తో సినిమా పాటలు ప్రసారం అయినట్టు ధర్మారెడ్డి వెల్లడించారు. ఇక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version