ఢిల్లీలో పచ్చ బ్యాచ్ కొత్త డ్రామాలు.. విజయసాయిరెడ్డి ట్వీట్..!

-

జగన్ ప్రభుత్వంపై రాష్ట్రపతికి టీడీపీ పార్లమెంట్ సభ్యుల బృందం ఫిర్యాదు చేసింది. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ‘రాష్ట్రపతికి ఫిర్యాదుల పేరుతో పచ్చ బ్యాచ్ ఢిల్లీలో కొత్త డ్రామాలు మొదలు పెట్టింది. నేరం చేసిన వారిపై కేసు పెడితే ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లు, అవినీతిపరులను అరెస్ట్ చేస్తే రాజ్యాంగం విఫలం అయినట్లు అట. మీ డ్రామాలు చూసి ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయి’ అని ట్వీట్ చేసారు.

అలాగే ‘‘బడికొస్తా’ పథకం పేరుతో లక్షా 82 వేల సైకిళ్లు బాలికలకు పంపిణీ చేసారట. ఎందరికి అందాయో,ఇచ్చినట్టు రికార్డుల్లో రాసారో దర్యాప్తులో వెల్లడవుతుంది. 30-40 ఏళ్ల కిందటి సైకిళ్లు ఇప్పటికీ రోడ్లపైన కనిపిస్తాయి. మూడేళ్లలోనే అమ్మాయిల సైకిళ్ల ‘గంట’లు ఎందుకు మూగబోయాయో శీను మాయ తెలియాల్సి ఉందని’ ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version