గద్దర్ ని గౌరవించడం అంటే దేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టే : సీఎం రేవంత్ రెడ్డి

-

గద్దర్ ని గౌరవించడం అంటే దేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టే అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రవీంద్రభారతిలో గద్దరన్న మరణించినప్పుడు అభిమానుల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో భౌతిక కాయం పెట్టించామని తెలిపారు. గద్దరన్న తన సిద్దాంతం కోసం చివరి శ్వాస వరకు పోరాడారు. నీ బాధ్యత నీవు నిర్వహించు.. ప్రజలు నీవెంటే ఉంటారని గద్దర్ చెప్పేవారు. గద్దరన్న కుటుంబం సర్వం కోల్పోయింది అన్నారు.

14 నెలలో గోరటి వెంకన్న తనకు అవార్డు ఇవ్వాలని అడగలేదు. తనతో విభేదించినా సరే.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో వాళ్లు ఉన్నారు. నాతో ఉంటేనే ఇస్తాం అని తాను అనుకోలేదు. గద్దరన్న, చుక్కా రామయ్య, అందె శ్రీ, గోరటి వెంకన్న, తిరుమలరావు ఎవరు ఎందులో తక్కువ. పక్క రాష్ట్రంలో ఉన్న 5 మంది కంటే తెలంగాణ వారు తక్కువనా..? అని ప్రశ్నించారు. రాష్ట్రాల కలయికనే కేంద్రం అన్నారు. కేంద్రంలో మంత్రిగా ఉన్న వ్యక్తులే ఇవ్వం అంటే.. ఎలా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version