నీ కోసం రూ. 3 లక్షలు ఖర్చు చేశాను అంటూ సూళ్లూరుపేట ఎమ్మెల్యేకు మహిళ శాపం …

-

నెల్లూరు జిల్లా లో సూళ్లూరుపేట నియోజకవర్గంలో నిన్న అనూహ్యమైన సంఘటన ఒకటి జరిగింది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి విజయాన్ని సాధించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య ఇంటింటికీ వెళ్లి పథకాల గురించి ప్రజలను అడిగే క్రమంలో నిన్న ఓజిలి మండలం కురుగొండ గ్రామంలో పర్యటించారు. ఈ గ్రామంలో వైసీపీ ఎంపీటీసీ ఇందిరమ్మ ఇంటికి వెళ్లిన సంజీవయ్యకు ఆమె నుండి షాక్ తగిలింది. ఆయనను చూసిన వెంటనే ఇందిరమ్మ నీకోసం గత ఎన్నికల్లో రూ. 3 లక్షలు ఖర్చు చేసి భారీ మెజారిటీ వచ్చేలా చేశాను. కానీ ఆ కృతజ్ఞతతో నువ్వు ఉండలేక పోయావు అంటూ ఆమె తన ఆవేదనను తెలుపుకుంది. నువ్వు నాకు ద్రోహం చేశావు నా శాపం నీకు ఎప్పుడైనా తగులుతుంది అంటూ రోదించింది. ఇందుకు కారణం గత ఎన్నికల్లో ఈమె ఎంపీపీ పదవి ఆశించినా రాలేదు.

అందుకే ఈమె తాను నమ్మక ద్రోహం చేశాడని బాధతో ఆలా శాపం పెట్టింది. ప్రస్తుతం ఇది పొలిటికల్ వర్గాలలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version