Mumbai :మహారాష్ట్ర సీఎంతో చంద్రబాబు భేటీ

-

ముంబై పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో భేటీ అయ్యారు. షిండే ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన నివాసానికి వెళ్లి కలిశారు.చంద్రబాబు రామ్మోహన్ నాయుడితో కలిసి ఏక్‌నాథ్ షిండే నివాసానికి వెళ్లారు. మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసమైన వర్షకు విచ్చేసిన చంద్రబాబుకు ఆయన స్వాగతం పలికారు.షిండే, ఆయన తనయుడు శ్రీకాంత్ షిండే, మరికొందరు శివసేన చీలికవర్గ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో తెలుగుదేశం పార్టీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే) వర్గం భాగస్వామ్య పార్టీలుగా ఉన్న సంగతి తెలిసిందే.

ఏక్‌నాథ్ షిండేతో చంద్రబాబు సుమారు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. రెండు రాష్ట్రాల మద్య సత్సంబంధాలు మరింత బలోపేతం చేసుకుంటామని అన్నారు. చంద్రబాబుకు అపార రాజకీయ అనుభవం ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి మహారాష్ట్ర సీఎం సన్మానించారు. చంద్రబాబు భేటీకి సంబంధించిన ఫోటోలను సీఎం ఏక్నాథ్ షిండే ఎక్స్(ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version