IPL 2024: సూర్య వీర ప్రతాపం…RCB పై ముంబై గ్రాండ్ విక్టరీ

-

Mumbai Indians won by 7 wkts: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో మరో ఓటమి చవిచూసింది బెంగళూరు రాయల్ చాలెంజర్స్. నిన్న ముంబై వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 7 వికెట్లు తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సిబి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.

Mumbai Indians won by 7 wkts

డూప్లిసిస్, దినేష్ కార్తీక్ అద్భుతంగా ఆడటంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది ఆర్ సి బి. అనంతరం బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ మొదటి నుంచి దూకుడుగా ఆడింది. 15.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించింది. సూర్య కుమార్ యాదవ్ 19 బంతుల్లో 52 పరుగులు చేసి చుక్కలు చూపించాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ 69 పరుగులు రోహిత్ శర్మ 38 పరుగులు చేసి ఆదుకున్నారు. ఇక ఇందులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్ర కు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news