మునుగోడు ఉప ఎన్నిక ద్వారా రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి – భూపేందర్ యాదవ్

-

మునుగోడు ఉపఎన్నిక ద్వారా రాష్ట్రంలో కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్. ఆదివారం యాదాద్రి కి వచ్చిన ఆయన చౌటుప్పల్ మునిసిపల్ కేంద్రంలోని లింగారెడ్డిగూడెంలో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన గొల్ల కురుమల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు లో బిజెపి గెలవడం అత్యవసరమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకోసమే తాను వచ్చానని అన్నారు.

రాష్ట్రంలో టిఆర్ఎస్ అన్ని రంగాలలో విఫలమైందని మండిపడ్డారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో అభివృద్ధి, ప్రతి కుటుంబానికి సంక్షేమం అందేలా బిజెపి కట్టుబడి ఉందన్నారు. దళిత బంధు పథకం ప్రచారానికి మాత్రమే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఈ పథకాలు ప్రజలను మభ్య పెట్టేందుకు తప్ప.. అవి వారి అభివృద్ధి కోసం తీసుకువచ్చిన పథకాలు కావని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version