తెలంగాణలో ఉపాధ్యాయుడి దారుణ హత్య..

-

తెలంగాణలో ఒక ఉపాధ్యాయుడిని చంపారు దుండగులు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈ దారుణమైన ఘటన జరిగింది. జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో ఓ ఉపాధ్యాయుడిని కిరాతకంగా హత్య చేశారు దుండగులు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే భగీరథ కాలనీలో నరహరి అనే ఉపాధ్యాయుడిని దారుణంగా నరికి చంపారు దుండగులు. నిజానికి ముందు నరికి చంపి ఈ ఘటనను యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు.

ఈ ఘటనలో నరహరిని ముందు కత్తితో నరికి అనంతరం కారుతో గుద్దించారు దుండగులు. ఈ ఘటన మీద పై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. నరహరి సీసీ కుంట మండలం ఉండ్యాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నట్లు చెబుతున్నారు. అప్పు చెల్లించలేదని చంపారని పోలీసులు చెబుతుంటే  రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో గొడవల కారణంగా.. జగదీష్ అనే రియల్టర్ చంపేశాడని నరహరి బంధువులు ఆరోపిస్తున్నారు. నిజానిజాలు తెలియాల్సి ఉంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version