తెలంగాణ ప్రభుత్వంపై మైసూరారెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

కడప: తెలంగాణ ప్రభుత్వంపై సీనియర్ నాయకుడు మైసూరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ వివాదాలపై ఆయన స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీకి రావాల్సిన కృష్ణా జలాలను తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా వాడుకుంటోందని మండిపడ్డారు.

బుధవారం మీడియాతో మాట్లాడుతూ మైసూరారెడ్డి తెలంగాణకు ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతోందని ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకోవచ్చుకదా అని నిలదీశారు. భేషజాలు ఎందుకు అడ్డం వస్తున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీటి సమస్యలను చర్చించుకోవడం లేదా అని మైసూరారెడ్డి ప్రశ్నించారు. ఈ పరిస్థితి ఏపీకి మంచిది కాదని సూచించారు కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టు అని మైసూరారెడ్డి ఆరోపించారు. మరి మైసూరారెడ్డి కామెంట్లపై ఏపీ, తెలంగాణ నేతల ఏమంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version