నాదెండ్ల మనోహర్: పవన్ “వారాహి యాత్ర” చరిత్రలోనే అద్భుతం…

-

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పేరుతో గోదావరి జిల్లాలో వారాహి పేరుతో యాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పార్టీ కార్యాలయం నుండి నాదెండ్ల మనోహర్ మర్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. ఈ యాత్ర మేము ఊహించదానికన్నా ఎక్కువగా సక్సెస్ అయిందన్నారు. ఈ యాత్రను చరిత్రలోనే అద్భుతమైన యాత్రగా పరిగణించాలి. ఈ యాత్రలో మేము గమనించిన ప్రకారం ప్రజలు అంతా జనసేనతో కలిసి నడవాలని ఎదురుచూస్తున్నారు. ఈ యాత్ర ద్వారా పవన్ అన్ని వర్గాల వారిని కలిసి వారి బాధలు ఏమిటో తెలుసుకున్నారు. ఇంకా ఆ సమస్యలపై రాబోయే రోజుల్లో ఏమి చేస్తాను అన్నది అందరికీ వివరించి చెప్పారు పవన్. ఇక ప్రజల నుండి వచ్చిన వినతులలో ఎక్కువ భాగం పెన్షన్ మరియు రోడ్ల గురించి వచ్చాయని తెలిపారు నాదెండ్ల. సీఎం జగన్ పాలన సరిగా చేయడం చేత కాక.. అర్ధం లేని ప్రమోషన్ కార్యక్రమాలను చేసుకుంటూ పోతున్నడని ఎద్దేవా చేశారు నాదెండ్ల.

వీటి కోసం కోట్ల కోట్ల ప్రజల డబ్బును దుబారా చేస్తున్నారంటూ ఆవేశంగా మాట్లాడారు. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడుతూ వేధిస్తున్నారన్నారు. త్వరలోనే వారాహి యాత్ర షెడ్యూల్ ను ప్రకటిస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version