బిగ్ బాస్ లో టోటల్ ఎంత మందో చెప్పిన నాగ్…!

-

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ కాసేపటి క్రితం ప్రారంభమైంది. బిగ్ బాస్ 4 ని నాగార్జున ప్రారంభించారు. ఈ షో కి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నాగార్జున ద్విపాత్రాభినయం చేసారు. బిగ్ బాస్ హౌస్ ని నాగార్జున తండ్రి పాత్రలో మొత్తం తిరిగి వీక్షించి… హౌస్ ని ప్రేక్షకులకు చూపించారు. ఇంట్లో ప్రతీ ప్లేస్ కి ఆయన వెళ్ళారు.

ఈ క్రమంలో బిగ్ బాస్ లో ఎంత మంది పాల్గొంటున్నారు అని నాగార్జున తండ్రి పాత్రలో ఉన్నాయన అడగగా… ఎంత మంది మేము తర్వాత చెప్తామని అన్నారు. ఆ తర్వాత డైనింగ్ హాల్ కి వెళ్ళగా అక్కడ కుర్చీలు లెక్కేసి 16 ఉన్నాయని అన్నారు. అంటే ఈ షో లో మొత్తం 16 మంది పాల్గొంటున్నారని తెలుస్తుంది. అయితే 14 మంది అని కొందరు అంటున్నారు. కాని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో ఇద్దరు వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అయితే హౌస్ లోకి వచ్చే అతిధుల కోసం కుర్చీలు ఏర్పాటు చేసి ఉండవచ్చని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version