జగన్ సతీమణి భారతితో భేటీ అయిన‌ మహేశ్ బాబు భార్య నమ్రత.. దేనిపై చర్చించారంటే..

-

ఏపీ ముఖ్యమంత్రి జగన్ భార్య భారతితో టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలోనే తమ ఇంటికి వచ్చిన నమ్రతకు భారతి సాదర స్వాగతం పలికారు. అయితే బుర్రిపాలెం గ్రామాన్ని మహేశ్ బాబు దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, గ్రామంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులను భారతికి నమ్రత వివరించారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వపరంగా సహకారం అందించాలని కోరారు.

అలాగే ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. పలు అంశాలపై చర్చించుకున్నారు. అంతకు ముందు నమ్రత విజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేదపండితుల ఆశీర్వచనం అందుకున్నారు. నమ్రతకు అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని ఆలయ ఈవో అందజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version