చంద్రబాబు అరెస్ట్ వెనుక అసలు ఉద్దేశాలు బయటపడుతున్నాయి : లోకేశ్

-

2024లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.. చంద్రబాబు నాయుడు గారు చస్తారు అంటూ.. వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో పంచాయతీల నుంచి ఉపముఖ్యమంత్రి పదవి వరకు.. అన్ని విభాగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలను అగ్రభాగంలో నిలబెట్టిన ఘనత జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్న ఆయన.. వారంతా కచ్చితంగా జగన్ పక్షాన ఉంటారన్నారు. రాష్ట్రంలో 175కి 175 సీట్లు వైఎస్సార్సీపీ గెలవబోతోందని గోరంట్ల మాధవ్ జోస్యం చెప్పారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రంలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్రలో ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు.

దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. రోజులు గడిచే కొద్దీ చంద్రబాబు అక్రమ అరెస్ట్ వెనుక అసలు ఉద్దేశాలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కుండబద్దలు కొట్టినట్టు చంద్రబాబుకు మరణ హెచ్చరిక జారీ చేశాడని, ఇటీవల ఆ ప్రసంగంలో ఎంపీ మాటలు వింటుంటే దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని లోకేశ్ వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక ఉన్న కుట్ర పొరలు ఒక్కొక్కటీ విడిపోతున్నాయని స్పష్టం చేశారు. తనకు హాని తలపెడతారంటూ చంద్రబాబు నుంచి దిగ్భ్రాంతికర లేఖ వచ్చిందని, ఇప్పుడు ఎంపీ గోరంట్ల మాటలతో దీని వెనుక ఎంతటి దుష్ట పన్నాగం ఉందో ఆవిష్కృతమైందని, చంద్రబాబు లేఖలోని అంశాలు నిజమేనని తేలాయని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version