రామ మందిరం ప్రారంభోత్సవం…. అందని ఆహ్వానం…

-

యూపీలోని అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తూన్నారు. త్వరలోనే ఈ మందిరం యొక్క నిర్మాణ పనులు పూర్తి అయి ప్రారంభ ఉత్సవం జరగబోతుందని మనందరికీ తెలిసిందే. వచ్చే నెల జనవరి 22వ తేదీన ఈ మందిర ప్రారంభ ఉత్సవానికి ముహూర్తం ఖరారు అయింది. అయితే ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులని ,సినీ ప్రముఖులను మరియు క్రీడాకారులను ఆహ్వానిస్తున్నారు. అయితే తనకి ఇప్పటివరకు ఆహ్వానం అందలేదని సునీల్ లాహ్రి విచారం వ్యక్తం చేశాడు.

మూడు దశాబ్దాల క్రితం రామ నంద సాగర్ తెరకెక్కించిన రామాయణం సీరియల్ లో నటించిన సునీల్ లాహ్రి ప్రేక్షకు లకు చేరువయ్యాడు. అందులో లక్ష్మణ్ ని పాత్ర పోషించాడు. రాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్, సీత పాత్ర పోషించిన దీపిక చికాలియా కి ఆహ్వానాలు అందాయి. రామాయణం లోని లక్ష్మణుని పాత్ర వారికి నచ్చలేదేమో లేక వ్యక్తిగతంగా తాను ఇష్టం లేనేమో అని నాకు మాత్రం అందలేదని విచారం వ్యక్తం చేశారు. నాతో పాటు ధారావాహికలో నటించిన ఇతర నటులకు మరియు సిబ్బందికి కూడా ఆహ్వానాలు అందలేదు. ఒకవేళ నన్ను పిలిచి ఉంటే సంతోషపడే వాడినని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news