అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 265కు చేరింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానంలోని 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది దుర్మరణం చెందారు. విమాన ప్రమాదంలో ప్రాణాలతో విశ్వాస్ అనే ప్రయాణికుడు బయటపడ్డాడు. మెడికల్ కాలేజీపై పడడంతో మరో 24 మంది మృతి చెందారు.

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి కూడా ఉన్నారు. మృతుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్, 7 మంది పోర్చుగీస్, ఒక్కరు కెనడా వాసి ఉన్నారు. మృతుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు టాటా సన్స్ గ్రూప్స్ చైర్మన్.