రాజస్థాన్లో నెలకొంది. స్కూల్ బిల్డింగ్ కూలి ఐదుగురు పిల్లలు మృతి చెందారు. రాజస్థాన్లోని ఝలావర్లో ప్రభుత్వ పాఠశాల భవనం కూలి ఐదుగురు విద్యార్థులు మరణించారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది.

మనోహర్థనా బ్లాక్లోని పీప్లోడి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఉపాధ్యాయులు, గ్రామస్తుల సహాయంతో కొందరు విద్యార్థులను రక్షించగలిగారు. గాయపడిన వారిని సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో చేర్చారు.