రీల్స్ పిచ్చి ఓ కుటుంబాన్ని విశాలంలో ముంచేసింది. సోషల్ మీడియా కాలంలో ప్రతి ఒక్కరూ చిన్న విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా రీల్స్ పిచ్చిలో పడి ఎంత సాహసం చేయడానికి అయినా సిద్ధపడుతున్నారు. ఇన్ స్టా రీల్స్ పిచ్చిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు మృతి చెందారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని నగ్ల స్వామి గ్రామంలో జరిగింది. యమునా నదిలో రీల్స్ తీసుకోవడానికి ఆరుగురు అమ్మాయిలు అక్కడికి వెళ్లారు.

ఆ నీటిలో ప్రమాదవశాత్తు ఓ యువతి కాలుజారి అందులో పడిపోయింది. తనని రక్షించడానికి మిగతా 5 మంది ప్రయత్నించి అదే నీటిలో కొట్టుకుపోయారు. వెంటనే అక్కడ ఉన్న వారందరూ పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. అప్పటికే ఆ నీటిలో పడిపోయిన నలుగురు అమ్మాయిలు మృతి చెందారు. అందులో నలుగురు అమ్మాయిల డెడ్ బాడీలను బయటకు తీశారు. మరో ఇద్దరు అమ్మాయిలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.