కూటమికి షాక్.. వైయస్ జగన్ సంచలన పోస్ట్

-

ఏపీ పోలీసుల తీరుపై వైయస్ జగన్ సంచలన పోస్ట్ పెట్టారు. కూటమి ప్రభుత్వంలో పోలీసుల వ్యవహార శైలి దారుణంగా తయారైందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు తీవ్రంగా గాయపరచటమే కాకుండా అవమానపరిచారని విమర్శించారు.

jagan chandrababu
jagan chandrababu

ప్రకాశం జిల్లాలో ఎస్ఐ రమేష్ ఒక ఇంట్లోకి చొరబడి మహిళపై దాడి చేశారన్నారు. పోలీసులు కోర్టుల అధికారాన్ని కూడా తమ చేతుల్లోకి తీసుకున్నారని.. ఇది రాజ్యాంగ హక్కులను కాల రాయటమే అని జగన్ ఎద్దేవా చేశారు.

కాగా నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు జరుగనున్నాయి. ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని.. ‘వెన్నుపోటు దినం’ పేరిట వైసీపీ నిరసన కార్యక్రమాలు జరుగనున్నాయి. నేడు వెన్నుపోటు దినానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news