ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ లెక్చరర్లకు అదిరిపోయే శుభవార్త. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న 39 కాంట్రాక్ట్ లెక్చరర్లు, 116 వర్క్ షాప్ సిబ్బంది సేవలను ప్రభుత్వం పొడిగించింది. జూన్ 1వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 30 వరకు కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేయడానికి అనుమతులు జారీ చేసింది. లెక్చరర్లకు నెలకు రూ. 61, 960 జీతం అందం ఉంది.

ఇదిలా ఉండగా…. కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికీ సంవత్సరం పూర్తయింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసుకున్నారు. తన ఏడాది పాలనపై మాట్లాడారు. ప్రజలకు సంవత్సరం పాటు అనేక రకాల పథకాలను అమలులోకి తీసుకువచ్చామని ఇక నుంచి ఇంకా మంచి మంచి పథకాలను తీసుకువస్తామంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు.