హైదరాబాదులోని ఎర్రగడ్డ ఆసుపత్రిలో కలకలం. ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఏకంగా 70 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒక వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులోని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ఒక్కసారిగా… 70 మంది అస్వస్థతకు గురయ్యారు. ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఫుడ్ పాయిజన్ జరిగింది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో… భాగంగా విందు భోజనం ఆసుపత్రిలో ఉన్న రోగులకు పెట్టారు. ఈ నేపథ్యంలోని 70 మందికి అస్వస్థత నెలకొన్నట్లు తెలుస్తోంది. అటు కార్డియాక్.. అరెస్టు కారణంగా కరణ్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన జరగగానే బాధితులు అందరికీ మెరుగైన వైద్యం అందించారు. మరోవైపు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై… కలెక్టర్ అనుదీప్ కూడా ఆరా తీస్తున్నారు.
ఎర్రగడ్డ ఆస్పత్రిలో 70 మందికి అస్వస్థత..!
ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఫుడ్ పాయిజన్
ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా విందు భోజనం
మరోవైపు, కార్డియాక్ అరెస్టుతో కరణ్ (30) అనే వ్యక్తి మృతి
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించిన కలెక్టర్ అనుదీప్ pic.twitter.com/dvwSfroqh9
— BIG TV Breaking News (@bigtvtelugu) June 3, 2025