తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. టోకెన్లు జారీ చేసే కౌంటర్లను మార్చేసింది టిటిడి పాలకమండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. తిరుమల శ్రీవారి మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను మార్చారు.

టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా టిటిడి పాలకమండలి మార్చడం జరిగింది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ కు… టోకెన్ల జారీ కౌంటర్లను మార్చుతూ టిటిడి పాలకమండలి నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సాయంత్రం నుంచి… భూదేవి కాంప్లెక్స్ లో కొత్త కౌంటర్లు ప్రారంభం కానున్నాయి.
కాబట్టి ఇకపైన శ్రీవారి మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ల జారీ ఉండబోదు. ఈ టోకెన్ల కోసం కచ్చితంగా భూదేవి కాంప్లెక్స్ లో… క్యూ కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి.