రతన్ టాటా కోసం దీనంగా ఎదురుచూస్తోన్న శునకం

-

దిగ్గజ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా అంత్యక్రియాలు బంధువులు, అభిమానులు, ప్రముఖుల కడసారి కన్నటీ వీడ్కోలు మధ్య అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. అయితే రతన్ టాటా అంత్యక్రియాల సందర్భంగా ఆయన పెంపుడు కుక్క తన యాజమాని కోసం కన్నీటి పర్యంతమైన ఘటన అందరిని కలచివేసింది. రతన్ టాటా భౌతికకాయం వద్ద పెంపుడు కుక్క దీనంగా విలపిస్తున్న దృశ్యం చూసిన వారంతా యాజమాని దూరమైన బాధతో ఆ కుక్క పడిన వేదనను చూసి చలించిపోయారు. గోవా అనే పెట్ డాగ్ అంటే రతన్ టాటాకు ఎంతో ప్రేమ. అది గోవాలోనే దొరికింది కాబట్టి దానికి గోవా అని పేరు పెట్టారు. బాంబే హౌస్ లోని ఎన్ని కుక్కలు ఉన్నా ఆయన దీని కోసం వెతికేవారు. గోవాతోనే ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడేవారు.

రతన్ టాటాతో కుక్కకు ఉన్న బంధాన్ని తలచుకుని అది చూపిన ‘విశ్వాసాన్ని ప్రశంసించారు. ముంబయి వర్ణి శ్మశాన వాటికలో రతన్ టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు జరిగాయి. వేలాది మంది ప్రజలు, పలువురు ప్రజా ప్రతినిధులు అంతిమ యాత్రలో పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అంతిమ యాత్రలో భారత ప్రభుత్వం తరుపున కేంద్రమంత్రి అమిత్ షా సహా వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. రతన్  టాటా మృతి కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా  సంతాప దినం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version