మా దేశ శరణార్థులకు ఈ గెలుపు అంకితం : అప్గానిస్తాన్‌ టీం

-

WCలో నాలుగు విజయాలు సాధించడం దేశానికి, తనకు బిగ్ అచీవ్మెంట్ అని ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ చెప్పారు. నెదర్లాండ్స్ పై గెలుపు అనంతరం మాట్లాడుతూ…..’మూడు నెలల కిందట మా అమ్మ చనిపోవడంతో కుటుంబం ఎంతో బాధలో ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ లో వేలాదిమంది మా దేశ శరణార్థులు ఇబ్బందుల్లో ఉన్నారు.

Afghanistan captain Hashmatullah Shahidi comments

వారి వీడియోలు చూస్తుంటే ఆవేదనగా ఉంది. ఈ విజయాన్ని వారికి అంకితం ఇస్తున్నా’ అని పేర్కొన్నారు. కాగా వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై ఆఫ్ఘనిస్తాన్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ఆఫ్గాన్ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ను వెనక్కి నెట్టి 5వ స్థానంలోకి దూసుకెళ్లింది. 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ను సమం చేసింది. కాగా, ఇది ఆఫ్గాన్ కు వరుసగా మూడో విజయం. ఇంతకుముందు ఇంగ్లాండ్, పాకిస్తాన్ లపై గెలిచింది. దీంతో పాటిస్తాన్ కు సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news