తీవ్రమైన ఎండలు ఎక్కువగా ఉంటే ఎయిర్ కండిషనర్ ను అందరు తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే, ఈ విధంగా ఏర్ కండిషనర్ వినియోగం ఎక్కువ అవడం వలన కొత్త నిబంధనలను తీసుకురావడానికి భారతదేశ ప్రభుత్వం ఒక ప్రయోగాన్ని నిర్వహించినది అని చెప్తోంది. దీనిలో భాగంగా కొత్త నిబంధనలను తీసుకు రావడం జరిగింది అనే చెప్పవచ్చు. వాటి ప్రకారం ఏసీ ఉష్ణోగ్రతను 20° సెల్సియస్ కంటే తక్కువ కానీ లేక 28° సెల్సియస్ కంటే ఎక్కువ కానీ సెట్ చేయడం కుదరదు.
ఈ విధంగా కొత్త ప్రమాణాలను తీసుకురావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అని అధికారులు చెబుతున్నారు. చాలా శాతం మంది 16° సెల్సియస్ లేదా 18° సెల్సియస్ వరకు టెంపరేచర్ ను సెట్ చేస్తూ ఉంటారు. అయితే దాని వలన విద్యుత్ వినియోగం చాలా ఎక్కువ అయింది అనే చెప్పవచ్చు. ఇల్లు లేదా వాణిజ్య ప్రదేశాలలో ఎయిర్ కండిషనర్ లను ఉపయోగించడానికి ఈ నిబంధన ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా చేయడం వలన పర్యావరణకు రక్షణ జరుగుతుంది అని అధికారులు చెబుతున్నారు.
అయితే, ఈ నిబంధనలను తీసుకురావడానికి కారణం జాతీయ పవర్ గ్రిడ్ పై భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఈ విధంగా కొత్త నిబంధనల ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవచ్చు మరియు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. సహజంగా భారతదేశంలో ఎయిర్ కండిషనర్ లను 20° నుండి 24° సెల్సియస్ వరకు సెట్ చేస్తూ ఉంటారు. అయితే, స్టార్ లేబుల్ గదులు మరియు కార్ ఏసీలకు 24° సెల్సియస్ ఉంటుంది. వాణిజ్య భవనాలకు 24° నుండి 25° సెల్సియస్ మధ్య ఉంటుంది. ఈ విధంగా ఉపయోగించడం వలన విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతుంది. కనుక, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ఈ నిబంధనలు ఎంతో సహాయం చేస్తాయి.