హెచ్‌-1బీ వీసాదారులకు శుభవార్త చెప్పిన అమెరికా

-

H-1B వీసాదారులకు అగ్రరాజ్యం అమెరికా శుభవార్త చెప్పింది. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు సహా పలువురు విదేశీ ఉద్యోగులు ఇక నుంచి తమ వర్క్ వీసాల పునరుద్ధరణ కోసం స్వదేశాలకు వెళ్లాల్సిన పనిలేదని తెలిపింది. అమెరికాలోనే వారు తమ వర్క్ వీసాలను రెన్యూవల్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీనికోసం పైలట్ ప్రోగ్రాంను త్వరలోనే చేపట్టనున్నట్లు వెల్లడించింది.

USA లోని H-1B వీసాదారుల్లో ఎక్కువ మంది భారతీయులే. కాగా, అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా అభివృద్ధి చెందితే ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ యూఎస్ కాంగ్రెస్ లో అన్నారు. ‘నేను తొలిసారి అమెరికాలో పర్యటించినప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఇప్పుడు ఐదో స్థానంలో ఉంది. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఈ మార్పు చాలా వేగంగా జరుగుతోంది’ అని మోదీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news