కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్న చిత్రం “కాంతార-2”. ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. కాగా, ఈ సినిమా షూటింగ్లో వరుసగా అపశృతులు ఎదురవుతున్నాయి. ఒకరి తర్వాత మరొకరు “కాంతార-2” సినిమాలో నటించే ఆర్టిస్టులు మరణిస్తున్నారు. మే 6వ తేదీన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తు నదిలో పడి మరణించాడు.

తాజాగా కేరళకు చెందిన మరో నటుడు విజు వికె నిన్న అర్ధరాత్రి ఛాతి నొప్పి కారణంగా కన్నుమూశారు. అంతేకాకుండా కాంతార సినిమాలో హీరో స్నేహితుడిగా నటించిన రాకేష్ పూజారి కూడా ఈనెల 12వ తేదీన గుండెపోటుతో మరణించాడు. “కాంతార-2” సినిమా షూటింగ్ లో ఇలా వరుసగా విషాదలు చోటు చేసుకోవడంతో చిత్ర బృందం సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వరుసగా ఇలా మరణాలు వెంటాడడంతో కొంతమంది భయాందోళనకు గురవుతున్నారు.