జులై 6 నుంచి రొట్టెల పండుగ.. విశేషాలు ఇవే…!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 6 నుంచి రొట్టెల పండుగ ప్రారంభం కానుంది. మతసామరస్యానికి ప్రతీకైన నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ జులై 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరగనుంది. ఈ పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. రాష్ట్ర పండుగ అయిన ఈ వేడుకకు లక్షలాది మంది ప్రజలు విపరీతంగా తరలివస్తారు. ఇక్కడికి చదువు బాగా రావాలని కోరుకుంటారు. ఆరోగ్యం బాగా లేని వారు ఇక్కడికి వచ్చి చెరువులో రొట్టెలను వదిలినట్లయితే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగం లేనివారు సైతం ఇక్కడికి వచ్చి ఉద్యోగం రావాలని మొక్కుకుంటారు.

These are the highlights of the Roti festival from July 6th
These are the highlights of the Roti festival from July 6th

పెళ్లి కాని వారు ఇక్కడికి వచ్చి మొక్కుకున్నట్లయితే సంవత్సరంలోపే వివాహం జరుగుతుంది. సంతానం కోసం మొక్కినట్లయితే వెంటనే సంతానం కలుగుతుంది. చాలామంది భక్తులు ఇక్కడ కోరికలు కోరుకుంటారు. ఇక్కడ కోరుకుని సంవత్సరం తిరిగేలోపే వారి కోరిక తీరుతుంది. చాలా రకాల కోరికలను నెరవేర్చుకోవడానికి స్వర్ణాల చెరువులో ప్రతి ఒక్కరూ రొట్టెలను వదులుతారు. లేదంటే అక్కడ ఉండే వారికి ఈ రొట్టెలను ఇస్తారు. వారు కోరుకున్న కోరిక తీరినట్లయితే మరసటి సంవత్సరం వచ్చి ఇక్కడ స్వర్ణాల చెరువులో రొట్టెలను వదలడం లేదా అక్కడ ఉండే భక్తులకు ఇవ్వడం చేస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం ఇలానే కొనసాగుతోంది. ఇక్కడ చాలామంది భక్తులు ఈ పండుగను నమ్ముతారు. ఎంతో భక్తితో ఇక్కడికి వచ్చి స్వర్ణాల చెరువులో రొట్టెలను వదిలి స్నానాలు చేసి వెళ్తారు.

Read more RELATED
Recommended to you

Latest news