విమాన ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది టాటా గ్రూప్. ఈ మేరకు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు.

ఎక్స్గ్రేషియాతో పాటు, క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ భరిస్తామన్నారు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్. బీజే మెడికల్ కాలేజ్ భవనాన్ని పునర్నిర్మిస్తామని తెలిపారు. కాగా అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని కన్నీటి పర్యాంతం చేస్తోంది.
దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతేకాదు ఈ విమాన ప్రమాద ఘటనలో 242 మంది మరణించడం బాధాకరం. విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మృతి చెందారు.
విమాన ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్
మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం
గాయపడిన వారికి వైద్య ఖర్చులు భరిస్తామని టాటా గ్రూప్ ప్రకటన pic.twitter.com/WNDDQEpflk
— BIG TV Breaking News (@bigtvtelugu) June 12, 2025