బాల్కనీపై చిన్నారి వేలాడిన వీడియో వైరల్.. ట్రోలింగ్ తల్లి సూసైడ్

-

సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురై మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటుచేసుకుంది. ఇటీవల చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్ పైకప్పు ప్లాస్టిక్ షీట్‌కు ఓ చిన్నారి ప్రమాదకరంగా వేలాడుతూ ఉన్న వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నెటిజన్లు ట్రోల్ చేయడంతో ఆ తల్లి సూసైడ్ చేసుకుంది.

అసలేం జరిగిందంటే.. ఏప్రిల్‌ 28న చెన్నైలో ఓ 8నెలల శిశువు అపార్ట్‌మెంట్‌లోని బాల్కనీ రేకులపై ప్రమాదకరంగా వేలాడగా స్థానికులు రక్షించిన ఘటన వైరల్‌ అయింది. అయితే పసిబిడ్డను చూసుకోవడం చేతకాదా అంటూ తల్లిపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ ఘటన తర్వాత డిప్రెషన్‌కు గురైన తల్లి రమ్య, కోయంబత్తూరులోని తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన రమ్య, ఆదివారం ఇంట్లోని కుటుంబ సభ్యులు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. వారు తిరిగి వచ్చేసరికి ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version