బెంగళూరు బ్లాస్ట్ అనుమానితుడు..కడపలోఅరెస్టు

-

కర్ణాటక రాజధాని బెంగళూరులో పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అలర్ట్ అయ్యారు. సిటీలో హై అలర్ట్ ప్రకటించారు. స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులను అప్రమత్తం చేశామని.. సున్నిత ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నట్లు సిటీ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఇక ఇటీవలే బెంగళూరు బాంబు పేలుడులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Bengaluru blast criminal

నిందితుడు 28 – 30 ఏండ్ల యువకుడిగా గుర్తించారు పోలీసులు. సీసీటీవీ పుటేజీ విడుదల చేశారు బెంగళూర్ పోలీసులు. అయితే బెంగళూరు బ్లాస్ట్ అనుమానితుడు..కడపలోఅరెస్టు అయినట్లు వార్తలు వస్తున్నాయి. బెంగళూరు బాంబు పేలుడు కేసులో అనుమానితుడిగా భావిస్తున్న అబ్దుల్ సలీం అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని సమాచారం అందుతోంది. జగిత్యాలకు చెందిన సలీం, వైఎస్ఆర్ కడప జిల్లాలోని మైదుకూరులో, ఓ ప్రార్థన మందిరం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో…పట్టుకున్నారట పోలీసులు. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version