ఐదేళ్లకోసారి దేశం కోసం 5 నిమిషాలు : సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్

-

సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై  భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో ఓటు హక్కుపై చైతన్యం కలిగించడానికి ఎన్నికల సంఘం ‘మై ఓట్ మై వాయిస్’ మిషన్‌లో భాగంగా ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడారు.

 ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశానిదని సీజేఐ అన్నారు. దేశ పౌరులైన మనకు రాజ్యాంగం అనేక హక్కులను కల్పించిందని,  అలాగే ఈ ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడం పౌరులుగా మన ప్రధాన బాధ్యత అని తెలిపారు. ఐదు సంతవత్సరాలకు ఒకసారి మన దేశం కోసం ఐదు నిమిషాలు కేటాయించడానికి సాధ్యమవుతుంది కదా అంటూ పిలుపునిచ్చారు. “ఓటు హక్కును వదులుకోవద్దని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నా. గర్వంగా ఓటు వేద్దాం. నా ఓటు నా వాయిస్‌’’ అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version