తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అయితే విదేశీ పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి.. రాత్రి ఢిల్లీ చేరుకున్నాడని సమాచారం. వీరి ఇరువురి సమావేశం పై ఇంకా స్పష్టత రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఈ అకస్మిక పర్యటన వెనుక గల కారణం ఏంటంటే..? తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం పై చర్చించేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్టు సమాచారం.
ఇక ఈ కేసులో పలువురు కీలక నిందితులు విదేశాలలో తల దాచుకుంటుండగా.. వారిని ఎలాగైనా ఇండియాకి రప్పించి, శిక్ష పడేటట్టు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ధృడ నిశ్చయంతో ఉంది. ఆయా దేశాల విదేశాంగ శాఖలతో మాట్లాడి నిందితులను ఇక్కడికీ రప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జైశంకర్ కు విజ్ఞప్తి చేయనున్నారని టాక్.