ఇండియాలో కొత్తగా 801 కరోనా కేసులు నమోదు

-

ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున తగ్గిన కరోనా కేసులు… ఇవాళ కాస్త పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 801 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,49,81,475 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 14,493 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 87.06 శాతంగా ఉంది.ఇక దేశంలో 08 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,31,778 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1815 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,44,35,204 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,20,66,92,059 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 55,636 మందికి కరోనా పరీక్షలు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version