Sabarimala : శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ..దర్శనానికి 16 గంటల సమయం

-

Sabarimala :  శబరిమల యాత్రకు భక్తులకు బిగ్‌ అలర్ట్‌. శబరిమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. శబరిమలలో దాదాపు 2 కిలో మీటర్లకు పైగా క్యూలో వేచి ఉన్నారు అయ్యప్ప భక్తులు. దీంతో శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.

Crowd of devotees increased in Sabarimala

భారీ క్యూ కారణంగా వృద్దులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నిన్న తొక్కిసలాట తర్వాత కూడా కేరళ ప్రభుత్వం, ట్రావెన్స్ కోర్ తీరు అస్సలు మారలేదని అయ్యప్ప స్వామి భక్తులు సీరియస్‌ అవుతున్నారు.. అధికారులు, పోలీసుల మధ్య లేని సమన్వయంతో తమకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు ఆగ్రహిస్తున్నారు. కాగా…శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ..నేపథ్యంలో ఇవాళ ఉదయం భక్తులపై లాఠీ ఛార్జ్‌ కూడా చేశారు పోలీసులు. దీంతో గందరగోళానికి గురయ్యారు అయ్యప్ప స్వామి భక్తులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version