మెదక్ లో బోల్తా కొట్టిన మినీ బస్సు..ఏకంగా 18 మంది !

-

మెదక్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మెదక్ లో బోల్తా కొట్టింది మినీ బస్సు. ఈ ప్రమాదంలో ఏకంగా 18 మందికి గాయలు అయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్‌ జిల్లా పెద్ద శంకరంపేట (మం) కమలపూర్ శివారులో NH161పై రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి నాందేడ్ వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా కొట్టింది ఓ మినీ బస్సు.

A road accident took place on NH161 in the suburb of Kamalapur, Pedda Shankarpet of Medak district

ఈ ప్రమాదంలో 18 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం జరుగగానే… 18 మందిని జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు స్థానికులు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెదక్ లో మినీ బస్సు బోల్తా కొట్టిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version