PM పోస్టు ఖాళీగా లేదు : కేంద్ర మంత్రి ధర్మేంద్ర

-

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ విజయం సాధిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఉద్ఘాటించారు. ప్రస్తుతం ప్రధానమంత్రి పదవి ఖాళీగా లేదని..  ఈసారి కూడా ప్రజలు మోదీవైపే ఉన్నారని అన్నారు. కోల్‌కతా శివారులో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో  ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడారు.

‘భారత్‌లో ప్రధానమంత్రి పదవి ఖాళీగా లేదు. దేశ ప్రజలు నరేంద్ర మోదీపై వరుసగా రెండుసార్లు విశ్వాసాన్ని నిరూపించారు. ఈసారి కూడా ప్రజలు మోదీవైపే ఉన్నారనే నమ్మకం ఉంది. పేద, మహిళలు, యువత, వెనకబడిన, గ్రామీణ ప్రజలు దేశాన్ని నడిపించే బాధ్యతను మోదీపై ఉంచారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందనడంలో ఎటువంటి అనుమానం లేదు’ అని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి తదుపరి ప్రధాని అయ్యే సామర్థ్యం ఉందని నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్ అన్నారు. ఆర్థికవేత్త చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే కేంద్ర మంత్రి ఈ విధంగా మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version