BREAKING : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

-

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బలరాంపుర్‌ జిల్లాలో ట్రక్కు, కారు ఢీకొని.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో.. కారులో ఉన్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీ దత్తగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బజాజ్ షుగర్ మిల్లు వద్ద రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

మృతులంతా దేవ్​రియా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ఓ భార్య, భర్త వారి నలుగురు పిల్లలు చనిపోయారు. వీరంతా కారులో దేవ్​రియా నుంచి నైనీతాల్​ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసి.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు ఇవాళ ఒడిశాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జాజ్‌పూర్‌ జిల్లా నంగళ వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న లారీని.. చండీకోల్‌ నుంచి పారాదీప్ వెళ్తున్న వ్యాను ఢీకొట్టడం వల్ల ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version