లక్షద్వీప్ వివాదం.. మాల్దీవులు రాయబారికి భారత్ సమన్లు

-

ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటనపై మాల్దీవుల డిప్యూటీ మంత్రులు అక్కసు వెళ్లగక్కడం ఇప్పుడు ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ రాయబారికి భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.  భారత్​లోని మాల్దీవులు హైకమిషనర్ ఇబ్రహీం షాహీబ్ సోమవారం ఉదయం విదేశాంగ కార్యాలయానికి వచ్చారు.

భారత్‌పై ముగ్గురు మాల్దీవుల డిప్యూటీ మంత్రులు అక్కసు వెళ్లగక్కడంపై ఆ దేశ ప్రభుత్వం స్పందిస్తూ.. విదేశీ నాయకులు, ముఖ్యంగా సన్నిహితమైన దేశమైన భారత్‌పై తమ ఎంపీలు విమర్శలు చేయడం ఆమోదనీయం కాదని స్పష్టం చేసింది. అది తమ ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబించదని వెల్లడించింది. జరిగిన దానిపై భారతీయులకు కోపం రావడం న్యాయమేనని ఆ దేశ ఎంపీ, మాజీ స్పీకర్‌ ఈవా అబ్దుల్లా అన్నారు.  జరిగిన దానికి క్షమాపణలు చెప్పిన ఈవా ఇంతటితో ఈ వివాదాన్ని ముగించాలని భారత్‌కు విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news