ఈఈ మెయిన్స్ రాసేటు వంటి విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఈఈ మెయిన్స్ 2024 నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వం నిధులతో నడిచే ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందగోరే విద్యార్థులు జేఈఈ మెయిన్స్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
![JEE Main application deadline is tomorrow](https://cdn.manalokam.com/wp-content/uploads/2023/11/JEE-Main-application-deadline-is-tomorrow.jpg)
నోటిఫికేషన్ లో ఇచ్చిన వివరాల ప్రకారం జేఈఈ మెయిన్స్ కు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు రేపటితో ముగియనుంది. గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. రేపటితో దరఖాస్తులు ముగియనుండగా, ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఎన్టిఏ సూచించింది.