నో డౌట్స్‌…మూడోసారి మోడీనే ప్రధాని – లక్ష్మణ్‌

-

మూడోసారి మోడీనే ప్రధాని..నో డౌట్స్‌ అంటూ బిజెపి పార్లమెంటరి బోర్డు మెంబర్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో బిజెపి పార్లమెంటరి బోర్డు మెంబర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇవాళ ఢిల్లీలో ఎన్డీయే కీలక సమావేశం ఉందని చెప్పారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ ఉంటుందన్నారు. ప్రధానిగా మోడీ అభ్యర్థిత్వం లో ఎలాంటి అనుమానాలు లేవు అని తేల్చి చెప్పారు బిజెపి పార్లమెంటరి బోర్డు మెంబర్ లక్ష్మణ్.

Key comments by BJP Parliamentary Board Member Laxman

మోడీ ని ప్రధాని అభ్యర్ధిగా ఎన్నుకోవడం లాంఛనమేనని తెలిపారు బిజెపి పార్లమెంటరి బోర్డు మెంబర్ లక్ష్మణ్. ఎన్నికలకు ముందే బిజెపి ప్రధాని అభ్యర్థిగా మోడీ నీ ప్రకటించిందన్నారు. ప్రభుత్వ సానుకూల ఓట్లే బిజెపిని మళ్ళీ గెలిపించాయని పేర్కొన్నారు. మూడో సారి మోడీ ప్రధానిగా త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. ఎన్డీయే కూటమిలో అన్ని పార్టీలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు బిజెపి పార్లమెంటరి బోర్డు మెంబర్ లక్ష్మణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version