కర్ణాటక రోడ్డు ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి తలసాని

-

కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కగా కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన 8 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

మొత్తం 35 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 28 మంది ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. బర్త్ డే పార్టీ కోసం వీరంతా గోవా వెళ్లినట్లుగా తెలుస్తోంది. 16 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. 8మంది సజీవదహనమయ్యారు. మిగిలినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్సు గోవా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఉదయం 5:50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version