భారతదేశంలో నక్సలిజం.. పెను ప్రమాదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి నక్సలిజాన్ని.. అణిచి వేసిన ఒకే ఒక్క మొనగాడు నరేంద్ర మోడీ. నక్సలిజం లాంటి అంశం ఎక్కువైతే భారత దేశ అభివృద్ధికి దెబ్బ. పెట్టుబడులు రావు.. పాలన సరిగా నడవదు.. అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంటుంది. యూపీఏ హయాంలో… ఈ అంశాలన్నీ దేశ ప్రజలు.. కల్లార చూశారు.

ఇంత జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం.. మావోయిస్టులపై ముందుకు వెళ్లలేకపోయింది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. నక్సలిజాన్ని మట్టుపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. దాదాపు ఇండియాలో నక్సలిజం.. అనే పదం లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే… మోడీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
ఆపరేషన్ కగార్
చతిస్గడ్ రాష్ట్రంలో.. మావోయిస్టులను ఊచ కోత కోస్తోంది మోడీ ప్రభుత్వం. రోజుకు నలుగురు చొప్పున మావోయిస్టులు మరణిస్తున్నారన్న వార్తలు కూడా ఈమధ్య ఎక్కువైన సంగతి తెలిసిందే. మోడీ ప్రభుత్వం దెబ్బకు.. వందల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ఆపరేషన్ కగార్ పేరుతో తాజాగా కొత్త… మిషన్ ప్రారంభించింది మోడీ ప్రభుత్వం. దీంతో మావోయిస్టు లు చుక్కలు చూస్తున్నారు. ఈ ఆపరేషన్ లో భాగంగా… చతిస్గడ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మావోయిస్టులను మట్టు పెడుతున్నారు అధికారులు. మోడీ ప్రభుత్వం నుంచి ఫుల్ పవర్ రావడంతో… మావోయిస్టులకు చుక్కలు చూపిస్తున్నారు అధికారులు. కాంగ్రెస్ హయాంలో కంటే.. మోడీ ప్రభుత్వం లోనే… నక్సలిజం అంతమైపోయిందని చెప్పవచ్చు.