నమీబియా నుంచి 12 ఆఫ్రికన్ జాతి చీతాలను భారత్ కు తీసుకువచ్చి మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్కులో ఉంచిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య ఈ చీతాలు నిర్దేశిత ప్రాతం దాటి బయటకు వెళ్తున్నాయి. ఇటీవలే తప్పించుకుపోయిన ఒబాన్ తీసుకురాగానే మరో చీతా నిర్దేశిత ప్రాంతం దాటిపోయింది. ఆశా అనే చీతా కూనో నేషనల్ పార్కులోని రిజర్వ్ ఫారెస్ట్ దాటి వీర్పుర్ ప్రాంతంలోని బఫర్ జోన్లోని వెళ్లిపోయింది. ఆశా ఎక్కువగా బఫర్ జోన్లోని నదుల వెంట సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా ఆశాకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆ పేరు పెట్టారు.
ఈ చీతాల వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని అటవీ అధికాలు చెబుతున్నారు. చీతాలు జంతువులను వేటాడవని అంటున్నారు. జనసంచారం ఉన్న ప్రాంతాల్లో సంచరించవని తెలిపారు. కానీ బఫర్ జోన్ పరిధిలోని గ్రామాల ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.