4 పిల్లలకు జన్మనిచ్చిన నామీబియా చిరుత

-

ప్రాజెక్ట్ చీతాలో భాగంగా గతేడాది సెప్టెంబర్ లో నబీబియా నుంచి 8 జీతాలను ప్రత్యేక విమానంలో తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. మనదేశంలో 1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చివరి చీత చనిపోయింది. ఆ తర్వాత వీటి ఆనవాళ్లు మనదేశంలో కనిపించలేదు. 74 ఏళ్ల తర్వాత చీతాలు మళ్లీ మన దేశంలోకి వచ్చాయి. మన దేశానికి తీసుకువచ్చిన చీతాల్లో ఐదు ఆడ చీతాలు, మూడు మగ చీతాలు ఉన్నాయి.

ప్రస్తుతం వీటి వయస్సు 5 ఏళ్ల నుంచి ఏడు ఏళ్ల మధ్య ఉంటుంది. అయితే ఇందులో ఓ చీతా 4 పిల్లలకు జన్మనిచ్చినట్లు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. ” గతేడాది సెప్టెంబర్ 17న ఇండియాకు తీసుకు వచ్చిన ఓ చీతాకు నాలుగు పిల్లలు పుట్టాయని చెప్పేందుకు సంతోషిస్తున్నాను. గతంలో జరిగిన పర్యావరణపరమైన తప్పులను సరిదిద్దుతూ.. జీతాలు భారత్ కు తిరిగి రావడంలో కృషి చేస్తున్న బృందానికి అభినందిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version